Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.668 కోట్ల పసిడి విమానం... నోరెళ్లబెట్టిన పెర్త్ వాసులు

మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు.

రూ.668 కోట్ల పసిడి విమానం... నోరెళ్లబెట్టిన పెర్త్ వాసులు
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (10:17 IST)
మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు. ఈ విమానంలో ఇస్మాయిల్ ఆయన భార్య జారీత్ సోఫియాతో కలిసి విహారయాత్రకు వచ్చారు. పెర్త్ నగరంలో ఆయనకు రూ.43 కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవంతి కూడా ఉంది. 
 
కాగా, ఈ బంగారపు విమానం ఖరీదు సుమారు రూ.668 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఉంటుందన్నారు. బోయింగ్ 737 చెందిన ఈ విమానంలో విలాసవంతమైన సదుపాయాలున్నాయి. డైనింగ్ రూము, బెడ్ రూము, షవర్, మూడు వంట గదులు ఇందులో ఉన్నాయి. సుల్తాన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తయారు చేయడానికి రెండేళ్లు పట్టింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్యాకేజీ కాదు హోదానే కావాలి.. లేదంటే బతుకు బస్టాండే: టీడీపీ లోక్‌సభ సభ్యుల మనోగతం