Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా కన్ను.. కామెంగ్ నదిలో కరిగే వ్యర్థాలు

Advertiesment
China
, సోమవారం, 1 నవంబరు 2021 (15:47 IST)
fish
భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని తన దేశంలో కలిపేసుకొవాలని చూస్తున్నది. లద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌లో బలగాలను మొహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 
 
అయితే, చైనా ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంది. చైనా నుంచి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించే నదులను కలుషితం చేస్తుంది. దీనివలన నదులు నల్లగా మారిపోతున్నాయి. అందులో నివసించే చేపలు, ఇతర జీవులకు ఆక్సీజన్ అందక వేల సంఖ్యలో మరణిస్తున్నాయి.
 
చైనా బోర్డర్‌లో పెద్ద ఎత్తున కట్టడాలను నిర్మిస్తుంది. ఈ కట్టడాల వ్యర్థాలను నదిలో కామెంగ్ నదిలో కలిపేస్తుంది. ఫలితంగా నదిలోని నీరు మొత్తం నల్లగా మారిపోయింది. సాధారణంగా లీటర్ నీటిలో కరిగే వ్యర్థాల పరిమాణం 300 మిల్లీ గ్రాముల నుంచి 1200 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. 
 
కానీ, కామెంగ్ నదిలో కరిగే వ్యర్థాలు 6800 మిల్లీ గ్రాముల వరకు ఉంటోంది. దీంతో నది మొత్తం నల్లగా మారిపోయి దేనికి పనికి రాకుండా పోతుంది. ఎగువ ప్రాంతంలో చైనా కట్టడాలు నిర్మిస్తూ వాటి వ్యర్థాలను పెద్ద సంఖ్యలో కామెంగ్ నదిలో కలిపేస్తుందని అధికారులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నౌకాదళంలోకి ‘పీ15బి’ తొలి నౌక