Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్-బంగ్లా సరిహద్దుల్లోనూ లేజర్ గోడలు, స్మార్ట్ సెన్సార్ల నిర్మాణం..

దాయాది దేశమైన పాకిస్థాన్ సరిహద్దు భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట నేపథ్యంలో.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దులో కొన్ని చోట్ల లేజర్ గోడలను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలనే ఇస్తున్

భారత్-బంగ్లా సరిహద్దుల్లోనూ లేజర్ గోడలు, స్మార్ట్ సెన్సార్ల నిర్మాణం..
, సోమవారం, 2 జనవరి 2017 (14:02 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్ సరిహద్దు భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట నేపథ్యంలో.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దులో కొన్ని చోట్ల లేజర్ గోడలను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలనే ఇస్తున్నారు. ఇదే తరహాలో భారత్-బంగ్లా సరిహద్దుల్లోనూ లేజర్ గోడల నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 
 
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అనునిత్యం చొరబాట్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఎందరో బంగ్లాదేశీయులు చట్ట విరుద్ధంగా భారత్‌లో నివసిస్తున్నారు. దీంతో, ఈ చొరబాట్లకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్ గోడలను, స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది. సరిహద్దులోని నదీతీర ప్రాంతాలలోను, కంచెను నిర్మించలేని ప్రాంతాలలోను ఈ గోడలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్నీర్‌సెల్వం‌కు ఎర్త్? చిన్నమ్మకు లైన్ క్లియర్... ప్రకటన విడుదల చేసిన తంబిదురై