Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిమ్ జోంగ్ ఉన్ తలకు బ్యాండేజీ ఏమైంది..?

కిమ్ జోంగ్ ఉన్ తలకు బ్యాండేజీ ఏమైంది..?
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (22:47 IST)
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(37) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా తన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యేలా తలకు బ్యాండేజీతో కిమ్ దర్శనమిచ్చారు.

జులై 24-27 మధ్య నిర్వహించిన కొరియా పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. కిమ్​ తల వెనక భాగంలో బ్యాండేజీ కనిపించింది.

ఈ ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. అయితే జులై చివర్లో జరిగిన మరో కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. బ్యాండేజీ స్థానంలో ఆకుపచ్చ రంగులో ఓ మచ్చ కనిపించింది.
 
ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్​గా మారాయి. దీంతో కిమ్​ ఆరోగ్యానికి ఏమైందని మరోసారి చర్చ ఊపందుకుంది. అయితే, కిమ్ ఆరోగ్యం అసాధారణంగా ఏమీ లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. 
 
బ్యాండేజీ తీసేసిన తర్వాత తలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని అధికారులు పేర్కొన్నట్లు దక్షిణ కొరియా మీడియా తెలిపింది. జులై 11న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తలపై ఎలాంటి బ్యాండేజీలు కనిపించలేదని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో అతి తక్కువ జీతం తీసుకోనున్న ఢిల్లీ ఎమ్మెల్యేలు, నెలకి రూ. 30,000