Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో మూసివేత.. విదేశీయుల ఆందోళన

Advertiesment
Kabul
, సోమవారం, 16 ఆగస్టు 2021 (13:50 IST)
Kabul
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబూల్‌లోకి తాలిబన్లు చొచ్చుకొస్తున్నారని వార్తలు అందటంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమయ్యాయి. 
 
వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. 
 
ఇక ఇదిలా ఉంటే, కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం రేగడంతో ఎయిర్‌పోర్ట్‌ను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సివిల్ ఏవియేషన్‌కు అనుమతులు ఇవ్వడం లేదని ప్రకటించారు. వెంటనే ఈ ఉత్తర్వులు అమలులోకి రావడంతో పలు దేశాలు తమ విమానాలను దారి మళ్లించాయి. ఢిల్లీ-చికాగో విమానంను దారిమళ్లించారు. 
 
కాబూల్ నుంచి ఇండియా దౌత్యవేత్తులు, అధికారులు, వ్యాపారం నిమిత్తం ఆ దేశం వెళ్లిన వారిని ఇండియారు తీసుకొచ్చేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండు ఎయిర్ ఇండియా విమానాలను సిద్ధంగా ఉంచింది. పంజాబ్ కు చెందిన 200 మంది కాబూల్‌లో ఉన్నారని, వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని పంజాబ్ ముఖ్యమంత్రి విదేశాంగ శాఖమంత్రిని విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌మ్య హ‌త్య కేసులో శ‌శికృష్ణ ను ప‌ట్టుకున్న కానిస్టేబుల్ ఇత‌డే!