Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిస్ ఇంగ్లండ్ విజేతగా భారత సంతతి అమ్మాయి

మిస్ ఇంగ్లండ్ విజేతగా భారత సంతతి అమ్మాయి
, శనివారం, 3 ఆగస్టు 2019 (11:01 IST)
మిస్ ఇంగ్లండ్ పోటీల్లో భారత సంతతికి చెందిన బాషా ముఖర్జీ విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో ఫైనల్‌కు మొత్తం 12 మంది అమ్మాయిలు ఎంపికకాగా, వారందరినీ తోసిరాజని బాషా ముఖర్జీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మిస్ ఇంగ్లండ్ పోటీలు తాజాగా జరిగాయి. ఈ అందాల పోటీల్లో 12 మంది ఫైనలిస్టులను అధిగమించి అందాల రాణి కిరీటాన్ని ముఖర్జీ దక్కించుకుంది. తద్వారా మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించింది. 
 
23 ఏళ్ల బాషా ముఖర్జీ ప్రస్తుతం ఓ జూనియర్ వైద్యురాలిగా బోస్టన్‌లో పనిచేస్తోంది. ఈమె ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈమె ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఒక మెడికల్ డిగ్రీ సంపాదించడమే చాలా కష్టమైన నేపథ్యంలో, అమ్మడు రెండు మెడికల్ డిగ్రీలు సాధించింది. 
 
అన్నింటికంటే ముఖ్యంగా, ఈ భారత సంతతి యువతి ఐక్యూ స్థాయి 146 కావడం విశేషం. బాషాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం బ్రిటన్ వలస వెళ్లింది. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. మెడిసిన్ చదువుతున్నప్పుడే అందాల పోటీల్లోనూ పాల్గొనాలని నిశ్చయించుకుని అందుకు సిద్ధమవుతూ వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల కొండపై ఒక్క ఇడ్లీ రూ.7.50 - ఫుల్ మీల్స్ రూ.31 మాత్రమే