Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థికవేత్త ఎన్.‌కే సింగ్‌కు జపాన్ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్'

ఆర్థికవేత్త ఎన్.‌కే సింగ్‌కు జపాన్ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్'
, శనివారం, 30 ఏప్రియల్ 2016 (09:24 IST)
ప్రముఖ ఆర్థికవేత్త, రాజ్యసభ సభ్యుడు ఎన్.కే. సింగ్‌కు జపాన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్‌, గోల్డ్‌ ఆండ్‌ సిల్వర్‌ స్టార్' పురస్కారాన్ని ప్రకటించింది. జపాన్‌ రెండో అత్యున్నత గౌరవ పురస్కారం. దీన్ని ఆ దేశ ప్రధాని షింజో అబే మే 10న సింగ్‌కు ప్రదానం చేయనున్నారు. 
 
టోక్యోలోని రాజప్రసాదంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో చక్రవర్తి అకిహిటో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాల వృద్ధిలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నందుకు గుర్తింపుగా సింగ్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు జపాన్‌ ప్రకటించింది. సింగ్ జపాన్‌లో పనిచేస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం మారుతి సుజుకీ పెట్టుబడుల నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ దేశ వాహనరంగ సంస్థలు భారత్‌లో ప్రవేశించాయి. 
 
ఈ పురస్కారంపై ఆయన స్పందిస్తూ... '21వ శతాబ్దంలో ఆసియా పునరుజ్జీవనం ప్రధానంగా భారత్‌-జపాన్‌ సంబంధాలపైనే ఆధారపడి ఉంది' అని వ్యాఖ్యానించారు. 1981లో జపాన్‌తో ఏర్పడిన బంధం ఇన్నేళ్లలో బాగా బలపడింది. ఇరు దేశాల సంబంధాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్‌ ప్రధాని షింజో అబేల హాయంలోనే అత్యంత స్నేహపూర్వకంగా ఉన్నాయి అని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెస్ట్ బెంగాల్ ఎన్నికలు : ప్రశాంతంగా సాగుతున్న ఐదో విడత పోలింగ్‌