ప్రముఖ ఆర్థికవేత్త, రాజ్యసభ సభ్యుడు ఎన్.కే. సింగ్కు జపాన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ది ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్, గోల్డ్ ఆండ్ సిల్వర్ స్టార్' పురస్కారాన్ని ప్రకటించింది. జపాన్ రెండో అత్యున్నత గౌరవ పురస్కారం. దీన్ని ఆ దేశ ప్రధాని షింజో అబే మే 10న సింగ్కు ప్రదానం చేయనున్నారు.
టోక్యోలోని రాజప్రసాదంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో చక్రవర్తి అకిహిటో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాల వృద్ధిలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నందుకు గుర్తింపుగా సింగ్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు జపాన్ ప్రకటించింది. సింగ్ జపాన్లో పనిచేస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం మారుతి సుజుకీ పెట్టుబడుల నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ దేశ వాహనరంగ సంస్థలు భారత్లో ప్రవేశించాయి.
ఈ పురస్కారంపై ఆయన స్పందిస్తూ... '21వ శతాబ్దంలో ఆసియా పునరుజ్జీవనం ప్రధానంగా భారత్-జపాన్ సంబంధాలపైనే ఆధారపడి ఉంది' అని వ్యాఖ్యానించారు. 1981లో జపాన్తో ఏర్పడిన బంధం ఇన్నేళ్లలో బాగా బలపడింది. ఇరు దేశాల సంబంధాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేల హాయంలోనే అత్యంత స్నేహపూర్వకంగా ఉన్నాయి అని వ్యాఖ్యానించారు.