50 ఏళ్ల వయస్సులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన జానెట్ జాక్సన్
ప్రముఖ గాయని జానెట్ జాక్సన్ 50 ఏళ్ల వయస్సులో తొలి సంతానానికి తల్లి అయ్యారు. ఏడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈమెకు పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడ
ప్రముఖ గాయని జానెట్ జాక్సన్ 50 ఏళ్ల వయస్సులో తొలి సంతానానికి తల్లి అయ్యారు. ఏడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈమెకు పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2012లో ఖతార్కు చెందిన వ్యాపారవేత్త విసాం అల్ మనాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏప్రిల్లో 'అన్బ్రేకబుల్' టూర్ను హఠాత్తుగా రద్దు చేసుకున్న జానెట్ ఇటీవల లండన్లో పిల్లలకు కావలసిన సామగ్రి కొంటూ కన్పించారు.
తాను కుటుంబంపై దృష్టిపెట్టాలనుకుంటున్నానని ఫ్యాన్స్కు ఇచ్చిన వీడియో సందేశంలో చెప్పుకొచ్చారు. 45 ఏళ్లు దాటాక పిల్లల్ని కనే హాలీవుడ్ ప్రముఖుల్లో జానెట్ కూడా చేరిపోయింది. కాగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత హాలెబెర్రీ 47 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు తల్లయ్యారు. జాన్ ట్రవోల్టా భార్య కెల్లీ ప్రెస్టన్ 48 ఏళ్ల వయసులో మూడో బిడ్డకు జన్మనిచ్చారు.