Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇటలీ భూకంపం... 247 మంది మృతి... ఇంకా పెరిగే అవకాశం...

బుధవారం నాడు ఇటలీలో సంభవించిన భారీ భూకంపానికి 247 మంది మృత్యువాత పడినట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. ఇటలీ మధ్యప్రాంతంలోని ఆయా పట్టణాల్లో శిథిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. శిథిలాలను తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య ఇం

ఇటలీ భూకంపం... 247 మంది మృతి... ఇంకా పెరిగే అవకాశం...
, గురువారం, 25 ఆగస్టు 2016 (12:00 IST)
బుధవారం నాడు ఇటలీలో సంభవించిన భారీ భూకంపానికి 247 మంది మృత్యువాత పడినట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. ఇటలీ మధ్యప్రాంతంలోని ఆయా పట్టణాల్లో శిథిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. శిథిలాలను తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
బుధవారం తెల్లవారు జామున గం.3.36 నిముషాలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలు 6.2గా నమోదైంది. తెల్లవారు జాము కావడంతో అంతా గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. దీనితో ప్రాణనష్టం అపారంగా ఉంటుందున్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మృతి ఇరానీకి ఉద్యోగం ఇవ్వని జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ.. ఎందుకో తెలుసా?