Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టర్కీలో కొత్త సంవత్సర వేడుకల్లో పెను విషాదం.. 35మంది మృతి..

టర్కీలో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పెను విషాదం జరిగింది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తు తెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది పరిస్థితి

Advertiesment
టర్కీలో కొత్త సంవత్సర వేడుకల్లో పెను విషాదం.. 35మంది మృతి..
, ఆదివారం, 1 జనవరి 2017 (09:19 IST)
టర్కీలో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పెను విషాదం జరిగింది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తు తెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.
 
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్‌లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇస్తాంబుల్ గవర్నర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. న్యూ ఇయర్ వేడుకులు జరుగుతుండగా నైట్ క్లబ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 500 మంది నైట్ క్లబ్‌లో వేడుకల్లో పాల్గొన్నారు. సాయుధుడు నైట్‌క్లబ్‌లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపై కాల్పులకు తెగబడ్డాడు. 
 
అనంతరం నైట్‌క్లబ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గవర్నర్ వివరించారు. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్నందున ఎవరికీ వారిపై అనుమానం రాలేదన్నారు. కాల్పులు జరుగుతుండగా ప్రాణ రక్షణ కోసం నైట్ క్లబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిన్నంటిన కొత్త సంవత్సరాది ఉత్సవాలు.. రామోజీ ఫిలిం సిటీలో సందడి..