Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

300 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మహిళ.. దెయ్యమై కనిపించింది.. ఎక్కడ?

300 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మహిళ.. దెయ్యమై కలకలం రేపింది. ఆ దెయ్యం యూకే జాతీయ సంపదైన ఆక్స్‌బర్గ్ హాల్‌లో ప్రత్యక్షమైంది. టెక్నాలజీ పెరుగుతున్నా.. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వివరాలు రోజుకొకటి నెట

Advertiesment
Is this the ghost of Oxburgh Hall? Visitor snaps eerie picture of 'cloaked woman who went missing in grounds of stately home 500 years ago'
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (18:42 IST)
300 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మహిళ.. దెయ్యమై కలకలం రేపింది. ఆ దెయ్యం యూకే జాతీయ సంపదైన ఆక్స్‌బర్గ్ హాల్‌లో ప్రత్యక్షమైంది. టెక్నాలజీ పెరుగుతున్నా.. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వివరాలు రోజుకొకటి నెట్లో దర్శనమిస్తున్నాయి. ఇదే కోవకు చెందిన ఓ ఘటన యుకేలోని నార్విచ్‌లో జరిగింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
ఆక్స్‌బర్గ్ హాల్‌ రాణీ ఎలిజిబెత్-I కాలంలో ఈ కోటా క్రిస్టియన్ మతపెద్దలకు ఆతిథ్య భవనంగా ఉండేదట. 300 వందల సంవత్సరాల క్రితం ఓ మహిళ హాల్ నుంచి తప్పిపోయిందని, ఆ మహిళే దెయ్యంగా తిరుగుతోందని ప్రచారంలో ఉంది. తాజాగా 46 ఏళ్ల వయసున్న "డయానా బెరోన్" అనే మహిళ అనుకోకుండా తీసిన ఓ ఫోటోలో దెయ్యంగా కనిపించింది. 
 
ఒక జంట హాల్ బ్రిడ్జ్‌పై మాట్లాడుకుంటుండగా జంటకు ఎదురుగా ఓ మహిళ కనిపిస్తోంది. ఫోటోలో పేర్కొంటున్న దెయ్యం ఆకారం మొహం నల్ల రంగులో కనబడుతోంది. గోడకు ఆనుకుని నిలుచున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ కోటలో దెయ్యం ఉందనే వాదన చాలా కాలం నుంచి ఉంది. ఈ ఫోటో నెట్‌లో వైరల్ అయ్యింది. ఇదంతా నిజమేనని ఫోటోకు ముందు అక్కడెవరూ నిలబడలేదని చెప్పింది. అయితే ఈ ఫోటోపై విభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రాహ్మణ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాననీ ఎవరు చెప్పారు: రాహుల్ గాంధీ