నా నగ్న ఫోటోలను ఫేస్బుక్ పోస్ట్ చేసింది... నష్టపరిహారం చెల్లించాల్సిందే : ఐర్లాండ్ బాలిక
ఐర్లాండ్కు చెందిన 14 యేళ్ళ బాలిక ఒకరు.. సోషల్ మీడియా ఫేస్బుక్పై కోర్టుకెక్కింది. తన నగ్నఫోటోలను ఫేస్బుక్ పోస్ట్ చేసి తన పరువు తీసిందనీ అందువల్ల తనకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్
ఐర్లాండ్కు చెందిన 14 యేళ్ళ బాలిక ఒకరు.. సోషల్ మీడియా ఫేస్బుక్పై కోర్టుకెక్కింది. తన నగ్నఫోటోలను ఫేస్బుక్ పోస్ట్ చేసి తన పరువు తీసిందనీ అందువల్ల తనకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఉత్తర ఐర్లాండ్కు చెందిన ఈ బాలిక, తన ఫోటోను అప్ లోడ్, రీ అప్ లోడ్కు 'ఫేస్ బుక్' అనుమతించిందంటూ మండిపడుతోంది. ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్ హైకోర్టును బాధిత బాలిక ఆశ్రయించింది. ఇదే అంశంపై బాలిక తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి నగ్నఫొటోను సంపాదించాడని, ఆ ఫొటోను ‘ఫేస్ బుక్’లో అప్లోడ్ చేశాడని పేర్కొన్నారు.
ఇటువంటి ఫొటోలను బ్లాక్ చేయాల్సిన ‘ఫేస్ బుక్’ అధికారులు, ఆ విధంగా చేయలేదని అన్నారు. అదే ఫొటోను పలుసార్లు అప్ లోడ్ చేసినా పట్టించుకోలేదని, తన క్లయింట్ పరువుకు నష్టం కల్గించిన ‘ఫేస్ బుక్’ సంస్ధ పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని బాలిక తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఖండిస్తూ ‘ఫేస్ బుక్’ యాజమాన్యం చేసిన వాదనను హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.