Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

Advertiesment
Ebrahim Raisi

ఠాగూర్

, సోమవారం, 20 మే 2024 (10:02 IST)
ఇరాన్ దేశంలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ చాపర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించినట్టు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ అధికారింగా వెల్లడించింది. అయితే, ఈ ప్రాంతంలో బతికున్నవారి ఆనవాళ్లు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఎర్ఎన్ఎన్ వెల్లడించింది. మానవరహిత విమానాలతో గాలింపు చర్యలు చేపట్టగా ప్రమాద స్థలికి సంబంధించి ఖచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్‌లు లభించవచ్చని పేర్కొంది. 
 
తావిల్ అనే ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం ధృవీకరించాల్సివుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుంది. రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు శ్రమిస్తున్నాయి. పొగమంచు, వర్షం గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. 
 
మరోవైపు, గాలంపు చర్యల కోసం 46 దళాలను రంగంలోకి దించినట్టు ఇరాన్ ప్రకటించింది. హెలికాఫ్టర్ కూలినట్టుగా అనుమానిస్తున్న ప్రదేశంలో సమీపానికి నాలుగు బృందాలు చేరిటన్టు ఐఆర్సీఎస్ అధిపతి రజీహ్ అలిష్వాండి వెల్లడించారు. ఇరాన్ - అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిల్ కలాసీ, ఖోదావరిన్ అనే రెండు డ్యామ్‌లను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో అధ్యక్షుడితో పాటు ఓ మంత్రి సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్