Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలిందిలా... (Video)

ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలిందిలా... (Video)
, సోమవారం, 24 డిశెంబరు 2018 (11:27 IST)
ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలింది. ఫలితంగా సునామీ సంభవించింది. ఈ రెండు ప్రళయాల కారణంగా ఇప్పటివరకు 220 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వందలాది మంది గాయపడగా, వేలాది మంది గల్లంతయ్యారు. 
 
ఇండోనేషియాలోని సుమత్రా, జావా దీవుల మధ్య ఉన్న క్రాకటోవా అగ్నిపర్వతం ఒక్కసారి పేలిపోయింది. దీంతో ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా, బూడిద ఆకాశంలో 500 మీటర్ల మేరకు ఎగిసిపడినట్టు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. శనివారం రాత్రి 9 గంటల తర్వాత ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ వచ్చింది. 
 
ఈ అగ్నిపర్వతం పేలుడుధాటికి సముద్రగర్భంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతోనే సునామీ వచ్చినట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు, ఇండోనేషియా సునామీ పరిశోధనా కేంద్రం అధికారులు వెల్లడించారు. సునామీ వచ్చినప్పుడు 20 అడుగుల ఎత్తులో అలలు వచ్చాయని చెబుతున్నారు. 
 
ఈ కారణంగానే వందల సంఖ్యలో భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. సహాయక చర్యలు కొనసాగిస్తోంది ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల కారణంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమని ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూతప్ప తొక్కితే బిడ్డలు పుడతారంట...