Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీ ప్రధానిగా ఉన్నంతవరకు మనం ఏకాకులమే : పాకిస్థాన్

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనం ఏకాకులంగానే ఉంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భా

Advertiesment
India
, ఆదివారం, 9 అక్టోబరు 2016 (08:33 IST)
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనం ఏకాకులంగానే ఉంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయనే ఆశ తమకు లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ భారత్ 'ఆధిపత్య ధోరణి' ప్రదర్శిస్తోందంటూ విమర్శల దాడి చేశారు. ఆసియా ప్రాంతంలో భారత్ ఆధిపత్య ధోరణిని పాకిస్థాన్ విభేదిస్తోందని, సమాన ప్రాతిపదికనే ద్వైపాక్షిక సంబంధాలు ఉండితీరాలని ఆయన పేర్కొన్నారు. 'మోడీ ప్రధానిగా ఉండగా భారత్‌తో సంబంధాల్లో పురోగతి ఉంటుందనే ఆశ మాకు (పాక్) లేదు' అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు అసోసియేట్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్ (ఏపీపీ) తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ బహిరంగ లేఖ