Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారు... ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపండి.. షరీఫ్ ఆదేశాలిచ్చారా?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారనీ, అందువల్ల ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు పాక్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఓ ఆసక్తికర కథనా

Advertiesment
నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారు... ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపండి.. షరీఫ్ ఆదేశాలిచ్చారా?
, గురువారం, 6 అక్టోబరు 2016 (13:13 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారనీ, అందువల్ల ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు పాక్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అదీ కూడా 'అసాధారణ మార్పు' అనే పేరుతో ఈ కథనాన్ని ప్రచురించి పెద్ద చర్చకే తెరలేపింది. 
 
ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహమ్మ‌ద్‌తో పాటు ప‌లు ఉగ్రవాద సంస్థలను క‌ట్ట‌డి చేయ‌డానికి పూనుకుంద‌ని తెలిపింది. పాక్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవ‌లే ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించార‌ని, అందులో ఈ అంశంపై ఆర్మీకి ఆదేశాలు జారీ చేశార‌ని ఆ పత్రికా కథనంలో పేర్కొంది. 
 
ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడితే అందులో ఆ దేశ జ‌వాన్ల ఆధ్వర్యంలోని నిఘా సంస్థలు క‌ల్పించుకోకూడ‌ద‌ని ష‌రీఫ్ చెప్పిన‌ట్లు పాక్ ప‌త్రిక‌ పేర్కొంది. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా.. ఈ దాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్థాన్ దోషిగా నిలబడింది. దీంతో నవాజ్ షరీఫ్ ఈ తరహా అసాధారణ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోకేమాన్‌ పిచ్చి బాగా ముదిరిపోతోంది.. పార్లమెంట్‌లో నార్వే ప్రధాని పోకెమాన్ ఆడుతూ...