Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడికేం పోయేకాలం ద్యావుడా.. వండే కూరను బట్టి ఇల్లు ఇస్తానంటాడు.

బ్రిటన్‌లో ఒక సంపన్న ప్రబుద్ధుడు భారత, పాకిస్తాన్ జాతీయులకు చస్తే కూడా తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని కరాఖండీగా చెప్పేస్తున్నాడు. విషయం కోర్టుకు వెళ్లినా వెనక్కు తగ్గేది లేదని ఇతడు మొండికేశాడు.

వీడికేం పోయేకాలం ద్యావుడా.. వండే కూరను బట్టి ఇల్లు ఇస్తానంటాడు.
హైదరాబాద్ , గురువారం, 18 మే 2017 (03:59 IST)
ఇక్కడ కుక్కలకు, నల్లవాళ్లకు ప్రవేశం లేదు అనేది 150 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలో కాని బ్రిటిష్ పాలిత ప్రాంత ప్రపంచంలో కానీ అలవాటుగా పాలకులు, పాలక జాతి ప్రజలు భారతీయులను అవమానపరుస్తూ చెప్పిన మాట. ప్రపంచంలో అలాంటి వివక్ష ఇప్పటికీ వివిధ రూపాల్లో అమలవుతోందని ఈ ఘటన తెలుపుతోంది. బ్రిటన్‌లో ఒక సంపన్న ప్రబుద్ధుడు భారత, పాకిస్తాన్ జాతీయులకు చస్తే కూడా తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని కరాఖండీగా చెప్పేస్తున్నాడు. విషయం కోర్టుకు వెళ్లినా  వెనక్కు తగ్గేది లేదని ఇతడు మొండికేశాడు. 
 
బ్రిటన్ సంపన్న గృహ పెట్టుబడిదారుడు ఫెర్గూన్ విల్సన్ వెయ్యి ఈగల్ని చంపిన వీరుడు కాదు కానీ వెయ్యికి పైగా ఇళ్లు ఉన్న సంపన్నుడు.  భారత్, పాకిస్తాన్‌ జాతీయులకు తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని చెబుతున్నాడు. దీనిపై వివాదం రేగినా, న్యాయపర చర్యలు తీసుకునే అవకాశమున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు.
 
భారతీయులకు, పాకిస్తానీయులకు ఎందుకు ఇళ్లు ఇవ్వనంటున్నాడు అని ఆరా తీస్తే షాక్ కలిగే వ్యాఖ్య చేశాడు.  ‘వారు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుంది. మళ్లీ కార్పెట్లు వేయడానికి ఖర్చవుతుంది..అందుకే వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వను. ఇది వారి శరీర వర్ణానికి సంబంధించిన సమస్య కాదు, కూర(కర్రీ)కు సంబంధించిన సమస్య..’ అనేశాడు.
 
అయితే  వెయ్యికిపైగా ఇళ్లున్న ఫెర్గూస్‌ భారతీయులపై విధించిన ఈ నిషేధాన్ని బ్రిటన్‌ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌(ఈహెచ్‌ఆర్‌సీ) కోర్టులో సవాలు చేసింది. విల్సన్‌ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని సెంట్రల్‌ లండన్‌ కౌంటీ కోర్టును కోరామని సంస్థ ప్రతినిధి రెబెక్కా హిల్సెన్‌రథ్‌ తెలిపారు. 
 
భారత్, పాక్‌ జాతీయులకు ఇళ్లను కిరాయి ఇవ్వొద్దంటూ ఫెర్గూస్‌ తన ఏజెంట్లకు పంపిన ఈమెయిల్స్‌ లీక్‌ కావడంతో వివాదం రేగింది.  
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిమెంట్ బస్తా రూ.310లకే విక్రయించాలి : మంత్రి మండలి ఉప సంఘం ఆదేశం