Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దోపిడీని అడ్డుకున్న భారత సంతతి మహిళ కాల్చివేత... ఎక్కడ?

Advertiesment
gunshot

ఠాగూర్

, ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (12:56 IST)
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ మరింతగా హెచ్చుమీరితోపోతోంది. తాజాగా ఓ దుండగుడు చేతిలో భారత సంతతి మహిళ హత్యకు గురైంది. సాయుధ దోపిడీని అడ్డుకోవడమే ఆ మహిళ చేసిన తప్పు.. దీంతో ఆ మహిళను ఓ దండగుడు వెంబడించి మరీ కిరాతకంగా కాల్చి చంపేశాడు. మృతురాలిని గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ (49)గా గుర్తించారు. యూనియన్ కౌంటీలోని పిక్నీ స్ట్రీట్‌లో మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కిరణ్ పటేల్ స్థానికంగా 'డీడీస్ ఫుడ్ మార్ట్' పేరుతో ఒక కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నారు. మంగళవారం ముసుగు ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో స్టోరులోకి ప్రవేశించాడు. దోపిడీ చేసే ఉద్దేశంతో వచ్చిన అతడిని చూసి కిరణ్ పటేల్ భయపడలేదు. వెంటనే అతడిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. తన చేతికి అందిన ఒక వస్తువును దుండగుడిపైకి విసిరి, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
 
దీంతో ఆగ్రహానికి గురైన దుండగుడు ఆమెపై కాల్పులకు తెగ బడ్డాడు. క్యాష్ కౌంటరుపైకి దూకి మరీ ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ప్రాణభయంతో కిరణ్ పటేల్ స్టోర్ బయట ఉన్న పార్కింగ్ వైపు పరుగులు తీశారు. అయినా ఆ దుండగుడు ఆమెను వదలకుండా వెంబడించి, మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె స్టోర్ ప్రవేశ ద్వారానికి కొద్ది దూరంలోనే రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు.
 
సమాచారం అందుకున్న వెంటనే యూనియన్ ప్రజా భద్రతా విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. ఈ ఘటన మొత్తం స్టోరులోని సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించి అరెస్టు చేశారు. ఉపాధి కోసం వెళ్లిన భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురికావడంతో స్థానిక ప్రవాస భారతీయుల్లో కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు