Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా గ్యాస్ పైప్ లేన్‌లో భారీ పేలుడు - 12 మంది మృతి

చైనా గ్యాస్ పైప్ లేన్‌లో భారీ పేలుడు - 12 మంది మృతి
, ఆదివారం, 13 జూన్ 2021 (16:32 IST)
చైనాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. హ్యూబెయ్ ప్రావిన్స్‌లోని షియాన్ సిటీలోని ఓ నివాస సముదాయం వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించిందని స్థానిక సీసీటీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 
 
ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 144 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో మరో 37 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. 
 
2013లో ఈశాన్య ప్రాంతంలోని ఖింగ్డావోలో జరిగిన పేలుడులాగే ఈ పేలుడూ సంభవించి ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు భూగర్భంలోని పైప్ లైన్‌లు లీకై పెద్ద పేలుడు సంభవించడంతో 55 మంది చనిపోయారు.
 
కాగా, 2015లో ఓ రసాయన గోదాములో జరిగిన ప్రమాదంలో 173 మంది మరణించారు. అందులో ఎక్కువగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులే ఉన్నారు. గోదామును అక్రమంగా నిర్మించడం, అనుమతుల్లేకుండా రసాయనాలను దాచడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో డోసు టీకా వేసుకున్న వ్యక్తి శరీరంలో అయస్కాంత శక్తులు!