Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి కళ్ల ముందే.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై గుండుతీసి పారిపోయారు.. ఎక్కడ?

చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై... నలుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తల్లి కంటి ముందే ఈ అఘాయిత్యం జరిగింది. ఆపై తల్లీకూతుళ్లకు రేపిస్టులు గుండుతీశారు. ఈ

Advertiesment
Four
, మంగళవారం, 1 ఆగస్టు 2017 (15:12 IST)
చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై... నలుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తల్లి కంటి ముందే ఈ అఘాయిత్యం జరిగింది. ఆపై తల్లీకూతుళ్లకు రేపిస్టులు గుండుతీశారు. ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని బోగ్రా ప్రాంతంలో 16 ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లి నివాసం ఉంటున్నారు. 
 
వారు నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు వారిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా బాలిక తల్లిని కట్టేశారు. తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఇద్దరికీ గుండుతీసి.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తి సర్కార్‌ పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులైన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
అంతేగాకుండా బాధితురాలికి సర్కారుకు అక్రమ సంబంధం ఉన్నట్లు ఆతని భార్య ఆషా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో ఆషాకు కూడా సంబంధాలున్నట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇప్పటికింతే సర్దుకుపోండి.. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచలేం.. హాన్స్‌రాజ్