Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గౌటాలో వైమానిక దాడులు.. ఎటు చూసినా బాంబులే..

సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో వి

గౌటాలో వైమానిక దాడులు.. ఎటు చూసినా బాంబులే..
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:09 IST)
సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. సైనిక వైమానిక దాడుల్లో ఇప్పటికే 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు వున్నారు. నిజానికి నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి తిరుగుబాటు దళాలు, సైన్యానికి సూచించినా.. రష్యా-సిరియా బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతూనే వున్నాయి. దీంతో సిరియా వీధులన్నీ శవాల దిబ్బలుగా మారాయి. ఎటుచూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. 
 
మొదటి దీంతో సిరియాలో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం గౌటాలో పరిస్థితిలు దారుణంగా ఉన్నాయి. ఎటు చూసినా బాంబులే. ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కూడా లేక ప్రజలు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి శ్రీదేవికి శవపరీక్ష చేసిన వ్యక్తి ఏ దేశస్తుడో తెలుసా?