Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మెరిట్' ప్రాతిపదికన కొత్త చట్టం.. భారతీయులకు మేలు చేసిన డొనాల్డ్ ట్రంప్..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులను అనుమతించే విధానంలో కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పటివరకు వలసదారుల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్న ట్రంప్.. మెరిట్ ప్రాతిపదికన వలసదారులను అనుమతించే విధానాని

'మెరిట్' ప్రాతిపదికన కొత్త చట్టం.. భారతీయులకు మేలు చేసిన డొనాల్డ్ ట్రంప్..?
, గురువారం, 3 ఆగస్టు 2017 (17:10 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులను అనుమతించే విధానంలో కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పటివరకు వలసదారుల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్న ట్రంప్.. మెరిట్ ప్రాతిపదికన వలసదారులను అనుమతించే విధానానికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యాధికులు ఎక్కువ వున్న దేశాలతో పాటు ముఖ్యంగా భారత్‌ చాలా లాభపడే ఛాన్సుందని ఐటీ నిపుణులు అంటున్నారు. 
 
ఇందులో భాగంగా రిఫార్మింగ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయిమెంట్ (RAISE) పేరిట ఓ చట్టాన్ని ఏర్పాటు చేశారు. దీని అమలు కోసం అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఆంగ్లంలో ప్రావీణ్యత, ఉన్నత విద్యతో పాటు మంచి జీతం, ఉద్యోగ అవకాశాలపై ఆధారపడే వలసదారులకు వీసాలు ఇస్తారు. ఈ చట్టం ద్వారా దారిద్ర్యాన్ని రూపుమార్చవచ్చునని, పన్ను చెల్లించేవారికి మేలు చేకూరుతుందని వైట్ హౌస్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''ఆంధ్రా పప్పు'' బ్రాండ్‌పై నారా లోకేష్ ఏమన్నారు..?