Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

Advertiesment
india pakistan flag

ఠాగూర్

, గురువారం, 19 జూన్ 2025 (10:37 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నిలువరించడానికి ప్రధాన సూత్రధారిని తానేనంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇపుడు ఇపుడు ఉన్నట్టుండి ఆయన మాట మార్చారు. ఈ యుద్ధాన్ని ఆపడంలో తన పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇరు దేశాలకు చెందిన ఇద్దరు తెలివైన వ్యక్తుల వల్లే అణు యుద్ధం తప్పిందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని భారత్ స్పష్టం చేసింది. 
 
బుధవారం ఉదయం వైట్‌హౌస్ లాన్‌లో డోనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని నేను ఆపేశాను. దీనికి సరైన గుర్తింపు లభించలేదు అని అన్నారు. అయితే, సుమారు 5 గంటల తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ అసిఫ్ మునీర్‌తో వైట్‌హౌస్‍‌లో విందుభేటీ జరిగింది. 
 
ఆ తర్వాత ఓవల్ కార్యాలయంలో జువెంటస్ ఫుట్‌‍బాల్ క్లబ్ సభ్యులతో సమావేశమైన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ఇద్దరు తెలివైన వ్యక్తులు, వారి సిబ్బంది కలిసికట్టుగా పని చేసి ఆ యుద్ధానికి ముగింపు పలికారు. అందుకు నేను సంతోషిస్తున్నాను. వారు ఇద్దరూ చాలా తెలివైనవారు. అందుకే అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉన్న ఆ ఘర్షణను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు అని వివరించారు. ఈ క్రమంలో తమ మధ్యవర్తిత్వ పాత్ర గురించి ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. 
 
అంతకుముందు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో లంచ్ మీటింగ్ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ యుద్ధంలోకి వెళ్లకుండా ముగించినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికే ఇక్కడికి ఆహ్వానించాను అన్నారు. పాకిస్థాన్ వైపు నుంచి దీనికి ఆపడంలో ఈ వ్యక్తి అత్యంత ప్రభావం చూపారు. అలగే, భారత్ వైపు నుంచి ప్రధాని మోడీ ఇతరులు కూడా అని ట్రంప్ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు