Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

చైనాకు భారత్ షాక్.. డ్రాగన్ పౌరులకు తీసుకురావద్దొంటూ..?

Advertiesment
Chinese nationals
, సోమవారం, 28 డిశెంబరు 2020 (13:55 IST)
చైనాకు భారత్ షాకిచ్చింది. ఇప్పటికే ఇండియా, చైనా మధ్య విమానాలు రద్దయ్యాయి. అయితే చైనా పౌరులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నారు. ఇప్పుడు వాళ్లను కూడా తీసుకురావద్దని ఎయిర్‌లైన్స్‌కు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా పౌరులను భారత్‌కు తీసుకురావద్దని అన్ని ఎయిర్‌లైన్స్‌కు అనధికారిక ఆదేశాలు జారీ చేసింది.
 
గత నవంబర్‌లో చైనా కూడా ఇలాగే ఇండియాతోపాటు పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు చైనా చెప్పింది. దీంతో సుమారు 1500 మంది భారత నావికులు వివిధ చైనా పోర్ట్‌లలో చిక్కుకుపోయారు. వారిని చైనా తమ దేశంలోకి అనుమతించలేదు. ప్రస్తుతం భారత్‌ కూడా చైనా పౌరులు దేశంలోకి రాకుండా నిషేధం విధించింది.
 
అయితే ఈ ఆదేశాలను లిఖితపూర్వక ఇవ్వాలని ఎయిర్‌లైన్స్ అడుగుతున్నాయి. టికెట్లు ఉన్న చైనా పౌరులు కూడా తమ విమానాలు ఎక్కకుండా ఉండాలంటే.. ఈ ఆదేశాలను చూపిస్తామని చెబుతున్నాయి. ఇప్పటికీ టూరిస్ట్ వీసాలను ఇండియా జారీ చేయడం లేదు. కానీ టూరిస్ట్ వీసాలు కాకుండా ఇతర కేటగిరీల వీసాలు ఉన్న వాళ్లు రావచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: ప్రపంచం తలకిందులవుతున్న వేళ ఈ ఐదుగురు రూ. 22 వేల కోట్లు వెనకేసుకున్నారు