Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కీలక నిర్ణయం.. భారత ప్రయాణీకులపై నిషేధం

కరోనా కీలక నిర్ణయం.. భారత ప్రయాణీకులపై నిషేధం
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:57 IST)
కరోనా మూడో వేవ్ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల దృష్ట్యా, భారత్ నుంచి వచ్చే ప్రయాణీకుల విమానాలపై నిషేధాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ ఈమేరకు సమాచారాన్ని ఇచ్చింది.
 
ఇంతకుముందు ఆగస్టు 21వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉండగా.. అది ఇప్పుడు సెప్టెంబర్ 21 వరకు పొడిగించారు. వాస్తవానికి, కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్‌ల దృష్ట్యా, కెనడియన్ ప్రభుత్వం, ఏప్రిల్ 22న మొదటిసారి భారత్‌పై నిషేధం విధించింది. తాజాగా సెప్టెంబర్ 21 వరకు ఈ నిషేధాన్ని పొడిగించబడింది. ప్రజారోగ్య ప్రాధాన్యం మేరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
 
అంతేకాదు.. భారతదేశం నుంచి కెనడాకు థర్డ్ కంట్రీ ప్రీ-డిపార్చర్ ద్వారా వెళ్లే ప్రయాణీకులకు కెనడా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ప్రయాణీకులకు కోవిడ్ నెగటివ్ RT-PCR పరీక్షలు అవసరం అని చెప్పారు. క్వారంటైన్ కంపల్సరీ అని స్పష్టం చేసింది. అదే సమయంలో, సెప్టెంబర్ నెలకి కరోనా పరిస్థితి మెరుగుపడితే, సెప్టెంబర్ 7 నుంచి పూర్తిగా టీకాలు వేయించుకున్న ప్రయాణికులకు సరిహద్దులను తెరుస్తామని ప్రభుత్వం తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంచి ఉజ్వల 2.0 పథకానికి శ్రీకారం