Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

Advertiesment
pakistan flag

ఠాగూర్

, బుధవారం, 18 జూన్ 2025 (15:11 IST)
పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదాలు మరోమారు పెట్రేగిపోయారు. రైలు మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. పట్టాలపై అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు జకోబాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దుండగులు రైలు మార్గంలో ఐఈడీని అమర్చడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రతకు రైలు పట్టాలపై సుమారు మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. 
 
ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇకా తెలియాల్సివుంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 
 
కాగా, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు గతంలో దాడులకు గురైంది. ఈ యేడాది మార్చి నెలలో పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఇదే రైలును హైజాక్ చేసి వందల మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న విషయం తెల్సిందే. వారిని రక్షించేందుకు పాక్ సైనిక బలగాలు రంగంలోకి దిగి అనేక మంది మిలిటెంట్లను హతమార్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం