Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌కు మరో ట్రంప్ దెబ్బ.. కాల్‌సెంటర్లు ఇక విదేశాలకు తరలించేది లేదు.. కొత్త బిల్లు ప్రవేశం

అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో బిల్లుతో భారత్‌పై గండికొట్టింది. అమెరికా ఉద్యోగాలను విదేశాలకు తరలించకుండా కంపెనీలను అడ్డుకోవడం, వాటిని అమెరికాలోనే ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడం ఈ బిల్లు ఉద్దేశం

భారత్‌కు మరో ట్రంప్ దెబ్బ.. కాల్‌సెంటర్లు ఇక విదేశాలకు తరలించేది లేదు.. కొత్త బిల్లు ప్రవేశం
, శనివారం, 4 మార్చి 2017 (11:20 IST)
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో బిల్లుతో భారత్‌పై గండికొట్టింది. అమెరికా ఉద్యోగాలను విదేశాలకు తరలించకుండా కంపెనీలను అడ్డుకోవడం, వాటిని అమెరికాలోనే ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడం ఈ బిల్లు ఉద్దేశం. ‘ది యూఎస్‌ కాల్‌ సెంటర్‌ అండ్‌ కన్సూ్యమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అనే ఈ బిల్లును డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన జీన్‌ గ్రీన్‌, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డేవిడ్‌ మెక్‌ కిన్లేలు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుద్వారా కాల్‌సెంటర్లను విదేశాలకు తరలించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలను దక్కకుండా చేయవచ్చు. తద్వారా భారత్ వంటి దేశాలకు ఉద్యోగాల తరలింపును అడ్డుకునేందుకు వీలుంటుంది. 
 
ఈ బిల్లు ప్రకారం.. తమ సేవల మొత్తాన్నీ లేదా ఎక్కువ భాగాన్ని విదేశాలకు తరలించే కంపెనీలతో ఒక జాబితాను నిర్వహించి.. వాటికి ఫెడరల్ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు దక్కనట్లు చేస్తారు. కాల్ సెంటర్ ఉద్యోగాలు భారత్‌, ఫిలిప్పీన్స్‌, ఇతర దేశాలకు తరలిపోయాయి. ఇరు పార్టీల మద్దతు ఉన్న ఈ బిల్లు వల్ల కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలను సంరక్షించడం సాధ్యమవుతుంది. అమెరికా వినియోగదారులకూ మేలు జరుగుతుంది. 
 
2013లో ప్రవేశపెట్టిన బిల్లు తరహాలోనే ఇది కూడా ఉంది. గ్రేటర్‌ హ్యూస్టన్‌ ప్రాంతంలోనే 54వేల కాల్‌సెంటర్‌ ఉద్యోగాలు ఉన్నాయని జీన్ గ్రీన్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా 25 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. సేవా రంగంలోని మంచి ఉద్యోగాలు అమెరికన్లకు దక్కాలని.. ఇంకా వారి జీవన మనుగడకు సరిపడా వేతనాలను పొందాలని వెల్లడించారు. దురదృష్టవశాత్తు కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలు భారత్‌, ఫిలిప్పీన్స్‌, ఇతర దేశాలకు తరలిపోయాయని జీన్ గ్రీన్ తెలిపారు. ఇరు పార్టీల మద్దతు ఉన్న ఈ బిల్లు వల్ల కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలను సంరక్షించడం సాధ్యమవుతుందని జీన్ గ్రీన్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరంలో 35.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత.. ఈ ఏడాది ఎండలు మండిపోతాయ్