Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్ పైన కసితో జో బైడెన్ కి గుద్దేసిన అమెరికన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్ పైన కసితో జో బైడెన్ కి గుద్దేసిన అమెరికన్లు
, శనివారం, 7 నవంబరు 2020 (16:42 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో డెమొక్రెటికి అభ్యర్థి జో బైడెన్ గెలుపు దాదాపు ఖరారైంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో బైడెన్ ముందుకు దూసుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు రాగా, బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు.
 
ఇక ఎన్నికల ఫలితాలపై జో బైడెన్ స్పంధించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం ఉందని తుది ఫలితం వచ్చేవరకు ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపుపై బైడెన్ స్పందిస్తూ ట్రంప్ పైన దాదాపు 40 లక్షల ఓట్ల మెజారిటితో గెలువబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
తమ పార్టీకి 7.5 కోట్ల ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ వ్యక్తికి కూడా ఇన్ని ఓట్లు పోలవ్వలేదని తెలిపారు. మరో వైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులపై బైడెన్ స్పందించారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపడుతానని బైడెన్ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసాం కామాఖ్యదేవీ ఆలయానికి ముఖేష్ అంబానీ దంపతులు 19 కిలోల బంగారం భారీ విరాళం