Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు: 107 మందికిపైగా మృతి.. వంద మందికిపైగా గాయాలు

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం నాటికి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది భారత సరిహద్దుకు సమీపంల

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు: 107 మందికిపైగా మృతి.. వంద మందికిపైగా గాయాలు
, బుధవారం, 14 జూన్ 2017 (09:35 IST)
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం నాటికి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న కొండప్రాంతమైన రంగమతి జిల్లాకు చెందినవారే. మృతుల్లో ఓ మేజర్‌, ఓ కెప్టెన్‌ సహా ఐదుగురు సైనిక సిబ్బంది ఉన్నారు.
 
రంగమతిని చిట్టగాంగ్‌ను కలుపుతూ ఉన్న ప్రధానరహదారిపై పేరుకున్న రాళ్లు, రప్పల తొలగింపు చర్యల్లో పాల్గొంటుండగా.. కొండ చరియలు విరిగిపడి వీరు మరణించినట్లు తెలిపారు. దాదాపు 100 మందికిపైగా గాయాలపాలయ్యారని.. మృతదేహాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనిక అధికారులు తెలిపారు. 
 
రుతుపవన వర్షాలతో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో చాలా వరకు మారుమూల ప్రాంతాలకు సహాయ చర్యలు అందించడం కష్టతరంగా మారింది. మరణాల్లో ఎక్కువ శాతం కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే సంభవించగా.. విద్యుదాఘాతానికి గురవడం, నీటిలో మునగడం, గోడలు కూలడం తదితర ఘటనల్లో మరికొందరు మరణించారని సైనిక అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ గ్రామంలో ఐదు రోజులు మహిళలు దుస్తులు వేసుకోరట.. భార్యతో భర్త ఒక్క మాట కూడా?