Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజా ఆగ్రహ జ్వాలలు- బంగ్లాదేశ్ పాలకుడిగా మహ్మద్ యూనస్

Bangladesh

ఠాగూర్

, శుక్రవారం, 9 ఆగస్టు 2024 (13:27 IST)
Bangladesh
బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. గత కొన్ని వారాలుగా నిరసన జ్వాలలతో అట్టుడికిన  బంగ్లాలో విద్యార్థి సంఘాల కోరిక మేరకు నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా మహ్మద్ యూనస్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ప్రజలకు భద్రత కల్పించే పాలన అందిస్తామని తెలిపారు.
 
విద్యార్థుల పోరాటంతో బంగ్లాదేశ్‌కు మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. వచ్చిన స్వాతంత్య్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని యూనస్ స్పష్టం చేశారు. దేశ పునర్ నిర్మాణంలో విద్యార్థులు అండగా ఉండాలని, బంగ్లాదేశ్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
 
"బంగ్లాదేశ్‌లో మొదట శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలి... అందుకోసం ప్రజలంతా కృషి చేయాలి... దేశంలో ఎక్కడా ఎవరిపైనా దాడులు జరగకుండా చూడాలి. దయచేసి ఎక్కువ మంది శత్రువులను సృష్టించవద్దు" అని యూనస్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలి.. వీడియో వైరల్