Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైతీలో ఘోరం - పెట్రోల్ ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం

హైతీలో ఘోరం - పెట్రోల్ ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం
, మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:08 IST)
హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో ఘోరం జరిగింది. గ్యాస్ ట్యాంకర్ ఒటి పేలడంతో ఏకంగా 50 మంది సజీవదహనమయ్యారు. ఈ మృతులను గుర్తించడం కూడా సాధ్యపడలేదు. ప్రమాద స్థలంలో ఒక శవాలతో శ్మశానంగా మారిపోయింది. 
 
దీనిపై ఆ నగర డిప్యూటీ మేచర్ పాట్రిక్ అల్మోనోర్ స్పందిస్తూ, హైటియన్ నగరంలో ఈ గ్యాస్ ట్యాంకర్ పేలిందని చెప్పారు. ఈ ప్రమాద స్థలంలో 50 నుంచి 54 వరకు సజీవంగా దహనమవడం చూశామని తెలిపారు. 
 
అలాగే, ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న అనేక గృహాలు కూడా కాలిపోయాయి. మృతులను గుర్తించడం, వారి వివరాలను తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారిందని ఆయన చెప్పారు. ఇటీవల హైతీ దేశంలో కొన్ని ముఠాలు గ్యాప్ పైప్ లైన్లను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ ఇంధన కొరత ఏర్పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ స్కిల్ కాలేజీల్లో ఇంగ్లీష్ లెర్నింగ్ ల్యాబ్స్ ఏర్పాటు