Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదులుగా భావించి పాఠశాల భవనంపై దాడి.. 27 మంది మృతి... ఎక్కడ?

Israeli strike

ఠాగూర్

, శుక్రవారం, 11 అక్టోబరు 2024 (08:51 IST)
పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ శరణార్ధి శిబిరంపై జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఓ పాఠశాల భవంలో ఉగ్రవాదులు ఉన్నారని తప్పుగా అంచనా వేసిన ఇజ్రాయేల్ సేనలు ఈ దాడికి పాల్పడ్డాయి. 
 
ఆ భవనంపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆ పాఠశాల భవనం పూర్తిగా ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై గాల్లోకి ఎగిరిపడ్డాయి. స్కూల్‌లో ఉగ్రవాదులు ఉండటంతోనే దాడి చేసినట్టు ఇజ్రాయేల్ చెబుతోంది. 
 
మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయేల్‌‍ దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడిలో తమ సహాయక ప్రతినిధులు ఇద్దరు గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. బీరుట్‌పై ఇజ్రాయేల్ జరిపిన వైమానికి దాడిలో 11 మంది మృతి చెందగా 48 మంది గాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంచుకొస్తున్న తుఫాను ముప్పు... 14 నుంచి ఏపీలో భారీ వర్షాలు...