Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్‌లో 300 ఎకరాల్లో లేడీస్ హాస్టల్స్

Advertiesment
Tim cook

ఐవీఆర్

, శుక్రవారం, 30 మే 2025 (15:56 IST)
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి చుక్కలు చూపిస్తున్నాడు. భారతదేశంలో యాపిల్ ఫోన్ల తయారీ వద్దని ట్రంప్ వారిస్తున్నా టిమ్ కుక్ అస్సలు పట్టించుకోవడంలేదు. ఇప్పటికే తొలిదఫా కర్నాటకలోని దేవనహల్లిలో యాపిల్ తయారీ ప్లాంట్ కోసం రూ. 3000 కోట్లు ఖర్చు చేసేసారు.
 
ఇప్పుడు అదే ఊపుతో ప్లాంటుకి అనుబంధంగా 300 ఎకరాల్లో ఉద్యోగుల కోసం హాస్టళ్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 23 కిలోమీటర్ల దూరంలో వుంది. ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తైన నేపధ్యంలో వచ్చే డిశెంబరు నాటికి ఇక్కడ నుంచి లక్ష ఐఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
మరోవైపు ఉద్యోగుల కోసం నిర్మించే హాస్టళ్లు ఈ ఏడాది చివరికి పూర్తవుతాయని చెబుతున్నారు. 30 వేల మంది ఉద్యోగుల్లో 80 శాతం వరకూ అంతా మహిళా ఉద్యోగులకే ఈ హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. భారతదేశంలో ఐ-ఫోన్ల తయారీని ఎంచుకోవడంతో కంపెనీకి కనీసం 1.7 లక్షల కోట్లు లాభాలు వచ్చే అవకాశం వున్నట్లు చెబుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ