Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరాయి పురుషుడితో మాట్లాడిందని... భార్య చెవులు కోసిన భర్త

ఆప్ఘనిస్థాన్‌లో దారుణం జరిగింది. భార్య పరాయి పురుషుడితో మాట్లాడిందన్న అక్కసుతో ఆమె రెండు చెవులను కసాయి భర్త కోసేశాడు. ఆప్ఘనిస్థాన్ దేశంలోని మజార్ ఐ షరీఫ్ నగరంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ

పరాయి పురుషుడితో మాట్లాడిందని... భార్య చెవులు కోసిన భర్త
, గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:36 IST)
ఆప్ఘనిస్థాన్‌లో దారుణం జరిగింది. భార్య పరాయి పురుషుడితో మాట్లాడిందన్న అక్కసుతో ఆమె రెండు చెవులను కసాయి భర్త కోసేశాడు. ఆప్ఘనిస్థాన్ దేశంలోని మజార్ ఐ షరీఫ్ నగరంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
జరీనా అనే 23 యేళ్ల మహిళ... తమ ఇంటి పొరుగున ఉన్న వ్యక్తితో తరచూ మాట్లాడుతూ వచ్చింది. దీన్ని ఆమె భర్త చూసి ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. దీంతో భార్య చెవులను అత్యంత కిరాతకంగా ఆ కసాయి భర్త కోశాడు. రెండు చెవులు కోయడం వల్ల తీవ్రంగా గాయపడిని జరీనా మజార్ ఐ షరీఫ్ నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 
 
13 ఏళ్ల వయసులోనే పెళ్లాడిన తనను భర్త చెవులు కోసినందున అతన్ని కఠినంగా శిక్షించాలని, అతనికి తాను విడాకులు ఇస్తానని జరీనా పేర్కొంది. భార్య చెవులు కోసి పారిపోయిన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాలిబన్ల పాలన ముగియడంతో మళ్లీ అప్ఘనిస్థాన్ దేశంలో మహిళలపై అరాచకాలు ఎక్కువయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాంసం కొంటున్నారా? కనీస శుభ్రత పాటించట్లేదు.. జరజాగ్రత్త..