Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నూడుల్స్ ఆరగించి 9 మంది మృతి.. ఎక్కడ?

నూడుల్స్ ఆరగించి 9 మంది మృతి.. ఎక్కడ?
, గురువారం, 22 అక్టోబరు 2020 (05:40 IST)
చైనాలోని ఓ కుటుంబం ఏడాది క్రితం చేసిన నూడిల్స్‌ బలైపోయింది. ఏకంగా 9 మంది కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయాయి. ఏడాది క్రితం ఇంట్లో నూడుల్స్ వండుకున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఏడాది పాటు అలాగే వదిలేశారు.

ఏడాది తర్వాత కుటుంబ సభ్యులంతా తలో చేయి వేద్దాం అన్నట్లుగా తిన్నారు. పులియబెట్టిన మొక్కజొన్న పిండితో చేసిన ఈ నూడుల్స్‌ను యేడాది పాటు ఫ్రిజ్‌లో పెట్టడంతో దాంట్లో బోంగ్రెకిక్ ఆసిడ్ అనే విష పదార్థం తయారైంది.

దీంతో ఈ నూడుల్స్ తిన్న 9 మంది (అందరూ పెద్దవారే) చనిపోయారు. కాగా, ముగ్గురు చిన్నారులు నూడుల్స్ రుచి వారికి నచ్చకపోవడంతో వారు తినలేదు. నూడుల్స్ తినకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. దసరాకు ముందుగానే బోనస్‌