Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో కాల్పులు కలకలం.. దండుగుల చేతిలో ఐదుగురి హతం

అమెరికాలో కాల్పులు కలకలం.. దండుగుల చేతిలో ఐదుగురి హతం

ఠాగూర్

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (13:49 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించాయి. ప్యూర్టోరికోలో కొంతమంది దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
 
ప్యూర్టో రికోలోని ప్యూర్టో రికన్ బార్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడ్డవారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడని తెలిపారు.
 
బాధితులందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కాటానో పట్టణ మాజీ మేయర్ సోదరుడు కూడా ఉన్నాడని తెలిపారు. కాగా ఈ కాల్పుల ఘటన డ్రగ్స్ అక్రమ రవాణాతో ముడిపడినదని అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. 
 
ఈ ప్రాంతంలో డ్రగ్స్ రవాణా జరుగుతున్నప్పటికీ కాల్పులు చోటుచేసుకోవడం అసాధారణ ఘటనగా పోలీసులు అభివర్ణించారు. కాల్పుల్లో చనిపోయిన ఓ 35 ఏళ్ల వ్యక్తిని డ్రగ్స్ వ్యాపారిగా అనుమానిస్తున్నామని, అతడిని లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులకు తెగబడ్డారని భావిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు. ఇదిలావుంచితే.. ప్యూర్టో రికో ద్వీపంలో సాధారణంగా క్రైమ్ రేటు తక్కువగా ఉంటుంది. అయితే ఈ యేడాది ఆ సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. 
 
ఈ సంవత్సరం ఇప్పటికే 74 హత్యలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలోనే సెయిబా పట్టణంలో డ్రగ్స్ సంబంధిత దాడి జరిగింది. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో అతిభయంకరమైన బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి!!