Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోసుల్‌లో విధ్వంసం సృష్టించిత ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు: 24 మంది హతం

ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు ఇరాక్‌లో విరుచుకుపడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చారు. శుక్రవారం ఖయ్యరా ప్రా

Advertiesment
మోసుల్‌లో విధ్వంసం సృష్టించిత ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు: 24 మంది హతం
, శనివారం, 3 డిశెంబరు 2016 (17:57 IST)
ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు ఇరాక్‌లో విరుచుకుపడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చారు.

శుక్రవారం ఖయ్యరా ప్రాంతంలో ఇస్లామిక్‌ స్టేట్ జరిపిన రెండు కారు బాంబు దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడిన సంగతి తెలిసిందే. మోసుల్‌కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖయ్యరాలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. 
 
ఖయ్యరాను ఇరాకీ సేనలు ఆగస్టు చివర్లో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం ఆపరేషన్ మోసుల్‌ను చేపట్టిన ఇరాకీ సేనలకు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది. ఈ క్రమంలో టెర్రరిస్టులు పాల్పడిన ఉగ్రదాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి బ్యాంకులను ఆదుకుంటున్న శ్రీనివాసుడు!