Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ పోటీలు.. 1300 మందిని ఓడించిన భారత విద్యార్థి!

అంతర్జాతీయ గణిత పోటీ (ఇంటర్నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్)లో భారత విద్యార్థి సత్తా చాటాడు. ఈ పోటీల్లో 1300 మంది విద్యార్థులను 14 యేళ్ళ విద్యార్థి ఓడించి విజేతగా నిలిచాడు.

ఇంటర్నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ పోటీలు.. 1300 మందిని ఓడించిన భారత విద్యార్థి!
, శుక్రవారం, 29 జులై 2016 (10:53 IST)
అంతర్జాతీయ గణిత పోటీ (ఇంటర్నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్)లో భారత విద్యార్థి సత్తా చాటాడు. ఈ పోటీల్లో 1300 మంది విద్యార్థులను 14 యేళ్ళ విద్యార్థి ఓడించి విజేతగా నిలిచాడు. 
 
అబాకస్ లెర్నింగ్ ఆఫ్ హయ్యర్ అర్థమెటిక్(ఏఎల్ఏహెచ్ఏ) ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇండోనేషియలో ఈనెల 24న అంతర్జాతీయ గణిత పోటీ నిర్వహించింది. 18 దేశాలకు చెందిన 1,300 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. భారత్ తరపున అహ్మదాబాద్‌లోని హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాల విద్యార్థి తుషార్ తలావత్(14) కూడా పాల్గొన్నాడు. 
 
తన అద్భుత ప్రతిభతో అందరినీ ఓడించి విజేతగా నిలిచాడు. తుషార్ గెలుపుతో గురుకుల పాఠశాల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన తుషార్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల జడివాన కురుస్తోంది.
 
గతేడాది అక్టోబరులో గుజరాత్‌లో నిర్వహించిన పోటీలో 70 ప్రశ్నలకు కేవలం మూడు నిమిషాల్లో సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పోటీలో తుషార్ 5,300 మందిని ఓడించాడు. చెన్నైలో గత డిసెంబరులో జరిగిన జాతీయస్థాయి పోటీలో 4,300 మందిని ఓడించి విజేతగా నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియాలో భారతీయుడికి మరణశిక్ష.. రక్షించేందుకు కేంద్రం యత్నాలు