Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లంక స్థానిక ఎన్నికలు: మీడియాపై నిషేధం

లంక స్థానిక ఎన్నికలు: మీడియాపై నిషేధం
శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రత్యేక తమిళ దేశాన్ని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి గత మూడు దశాబ్దాలుగా ఎల్టీటీఈ తీవ్రవాద గ్రూపు పోరాటం జరిపిన సంగతి తెలిసిందే.

ఎన్నో ఏళ్లపాటు ఎల్టీటీఈ ఆధీనంలో ఉండి, ప్రభుత్వ పాలనకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఎల్టీటీఈ తిరుగుబాటును శ్రీలంక సైన్యం పూర్తిగా అణిచివేసిన సంగతి తెలిసిందే.

సమస్యాత్మక ఉత్తర ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ దళాల ఆధీనంలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రధాన నగరాల్లో శనివారం స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పరిశీలించేందుకు శ్రీలంక ప్రభుత్వం మీడియాను అనుమతించడం లేదు.

వావూనియా, జాఫ్నా నగరాల్లోకి విలేకరులకు ప్రవేశం లేకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. 25 ఏళ్ల పౌర యుద్ధానికి సాక్ష్యంగా నిలిచిన ఈ రెండు నగరాల్లో శనివారం జరిగే స్థానిక ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బీజాలు పడనున్నాయి.

ఈ ఎన్నికల సందర్భంగా మీడియాపై నిషేధం విధించడానికి ప్రభుత్వం ఎటువంటి కారణం వెల్లడించలేదు. భద్రతాపరమైన కారణాల వలన ఇతరులెవరినీ ఈ ప్రాంతంలోకి అనుమతించడం లేదని ప్రభుత్వం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu