Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యుద్ధనేరాలపై లంక నిశితంగా పరిశీలించాలి: నిరుపమా

Advertiesment
శ్రీలంక
ఎల్టీటీఈపై పోరు సందర్భంగా యుద్ధనేరాలపై శ్రీలంక ప్రభుత్వం నిశితంగా పరిశీలించాలని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమా రావు అన్నారు. శ్రీలంక యుద్ధనేరాలపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన సన్‌డే పత్రిక ప్రచురించింది. శ్రీలంక ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘించిందని ఓ న్యూస్ ఛానెల్ యుద్ధనేరాలపై ప్రసారం చేసింది.

దీనిపై శ్రీలంక ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని నిరుపమా కావు కోరారు. భారత విదేశాంగ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుని, అమెరికాలో భారత రాయబారిగా ఎంపికైన నిరుపమారావు శ్రీలంక పర్యటన చేపట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిరుపమారావు లంక యుద్ధనేరాలపై టీవీలు, పత్రికలు ప్రసారం, ప్రచారం చేసిన కథనాలను తప్పు బట్టలేము. అయితే శ్రీలంక ప్రభుత్వం స్పందించి యుద్ధనేరాలపై నిశితంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మూడో మనిషి తల దూర్చడం కుదరదని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu