Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్లమెంట్‌లో ముషారఫ్ భవితవ్యం: పాక్ ప్రధాని

Advertiesment
పార్లమెంట్
మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భవితవ్యాన్ని పార్లమెంట్ తేల్చుతుందని పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ చెప్పారు. ముషారఫ్ సైనిక అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలో ఎమెర్జెన్సీ విధించారు. దీనిపై దాఖలైన పిటీషన్‌పై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దేశంలో ఎమర్జెన్సీ విధించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసులను సైతం ముషారఫ్ ధిక్కరించారు.

దీంతో ముష్ భవితవ్యం కష్టకాలంలో పడింది. ఈ అంశంపై పాక్ ప్రధాని గిలానీ స్పందిస్తూ.. సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై ఆది నుంచి తాను ఒకే మాట చెపుతున్నాను. పార్లమెంటే ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించేందుకు గిలానీ నిరాకరించారు.

తమ పార్టీకి ఒక సిద్ధాంతమంటూ ఉంది. దేశంలో నియంత పరిపాలనకు తమ పార్టీ మద్దతు తెలుపదన్నారు. అలాగే, అధ్యక్షుడు జర్దారీకి తనకు మధ్య విభేదాలు ఉన్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను గిలానీ తోసిపుచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu