Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ ఆర్మీకి శిక్షణ ఇవ్వనున్న శ్రీలంక ఆర్మీ

Advertiesment
పాక్ ఆర్మీ
, ఆదివారం, 23 ఆగస్టు 2009 (13:06 IST)
సొంతగడ్డపై ఏళ్ళతరబడి తిష్టవేసిన ఎల్టీటీఈ వేర్పాటు వాదులను శ్రీలంక సైన్యం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ శ్రీలంక సైనిక వీరులు తీవ్రవాదులతో పోరాడుతున్న పాకిస్థాన్ సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో ఉత్పన్నమయ్యే తిరుగుబాటు చర్యలను అణిచి వేసేందుకు పాక్ మిలిటరీకి శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇదే తరహా శిక్షణను భారత్‌కు కూడా ఇవ్వనుంది.

దీనిపై శ్రీలంక ఆర్మీ న్యూ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జగత్ జయసూర్య బీబీసీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. తిరుగబాటు చర్యలను అణిచి వేసే నిమిత్తం శిక్షణ ఇవ్వాలని పాకిస్థాన్ తమను కోరిందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించనున్నట్టు ఆయన చెప్పారు.

అలాగే.. ఇదే తరహా సాయాన్ని ద్వైపాక్షిక మార్గాల ద్వారా భారత్, అమెరికా, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్‌ దేశాలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తమ దేశంలోని ఎల్టీటీఈ తిరుగుబాటు దారులను ఏ విధంగా అణిచి వేశామో.. తాము చేతల్లో చేసి చూపామని లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu