Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌లో బైతుల్లా మెహసూద్ ప్రతినిధి అరెస్ట్

Advertiesment
బైతుల్లా మెహసూద్
పాకిస్థాన్ తాలిబాన్ గ్రూపుకు చెందిన కీలక నేతను భద్రతా సిబ్బంది అరెస్టు చేసినట్లు ఆ దేశ నిఘా అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ ముఖ్య ప్రతినిధి మౌల్వీ ఒమర్‌ను అదుపులోకి తీసుకున్న ముగ్గురు పాకిస్థాన్ నిఘా అధికారులు తెలిపారు.

మొహమాండ్ గిరిజన ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న మౌల్వీ ఒమర్‌ను, అతని అనుచరులు ఇద్దరిని పాకిస్థాన్ సైనికులు పట్టుకున్నారని చెప్పారు. ఒమర్‌ను పట్టుకునేందుకు స్థానిక గిరిజన పెద్దలు సాయం చేశారు.

ఇటీవలి సంవత్సరాల్లో తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ ప్రధాన ప్రతినిధిగా ఒమర్ వ్యవహరిస్తున్నాడు. దేశంలో జరిగిన అనేక తీవ్రవాద దాడులకు తాలిబాన్లదే బాధ్యతని ఒమర్ ఆయా సందర్భాల్లో మీడియాకు ఫోన్ ద్వారా తెలియజేసేవాడు. ఒమర్ అరెస్టును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu