Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌కు యుద్ధనౌక అందజేసిన చైనా

Advertiesment
చైనా
పాకిస్థాన్‌కు చైనా మొదటి యుద్ధనౌకను అందజేసింది. మొత్తం నాలుగు యుద్ధనౌకలను పాకిస్థాన్‌కు అందజేసేందుకు చైనా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటి నౌకను ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో పెట్టింది. ఎఫ్- 22పి అనే ఈ యుద్ధ నౌక పాకిస్థాన్ నావిక దళ అవసరాలకు ఉపయోగపడబోతుంది.

షాంఘైలోని జోన్‌గువా షిప్‌యార్డులో ఈ యుద్ధనౌకను నిర్మించారు. దీనిని గురువారం పాకిస్థాన్‌కు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2005లో పాకిస్థాన్, చైనా మధ్య కుదిరిన ఒప్పందాల్లో ఈ యుద్ధనౌకల కాంట్రాక్టులు కూడా ఉన్నాయి.

యాంటీ సబ్‌మెరైన్ హెలికాఫ్టర్లు, ఉపరితలం నుంచి ఉపరితలం మీద, ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థలను ఈ యుద్ధ నౌకలో ఉపయోగించవచ్చు. ఎఫ్- 22పి యుద్ధ నౌక పాకిస్థాన్ నౌకా దళ పాఠవాన్ని పెంచడంతోపాటు, స్వదేశీ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని కూడా పటిష్టపరచనుంది.

Share this Story:

Follow Webdunia telugu