భారతదేశానికి చెందిన నేపాల్ దౌత్యవేత్త రాకేష్ సూద్ శనివారంనాడు నేపాల్ ప్రధానిని కలిశారు.
నేపాల్ ప్రధాన మంత్రి మాధవ్ కుమార్ నేపాల్ను భారతదేశానికి చెందిన నేపాల్ దౌత్యవేత్త రాకేష్ సూద్ శనివారం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన నేపాల్ ప్రధానిని వచ్చే వారం భారత్ పర్యటించాలని ఆహ్వానించారు.
దౌత్యాధికారి నేపాల్ ప్రధానిని కలిసిన అనంతరం ఆ దేశ ప్రధాని పర్యటన ఖరారైనట్లు అధికారులు వెల్లడించారు.
తమ ప్రధాని ఆగస్టు నెల 18న భారతదేశ పర్యటన ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ నాయకులు తదితర ప్రముఖులతో సమావేశమౌతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని దౌత్యాధికారి రాకేష్ సూద్కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేసినట్లు అధికారులు తెలిపారు.