Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నార్త్ ఇరాక్‌లో ట్రక్కు బాంబు పేలి 25 మంది మృతి

Advertiesment
ఉత్తర ఇరాక్
ఉత్తర ఇరాక్‌లో శనివారం ట్రక్కులో అమర్చిన బాంబులు పేలి కనీసం 25 మంది మృత్యువాత పడ్డారు. మరో డజను మంది గాయపడినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. జూన్ 30వ తేదీన నుంచి ఈ ప్రాంతం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుడు జరగడం గమనార్హం.

కర్‌కుక్ అనే ప్రాంతంలో షియా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే అమెరికా దళాలు ఉపసంహరణ జరుగుతుందని ఇరాక్ ప్రధాని భావిస్తున్న తరుణంలో ఈ పేలుడు జరగింది.

దీనిపై బోలీసు బ్రిగ్ జనరల్ సర్హాత్ ఖాదర్ మాట్లాడుతూ.. తాజా ప్రాంతంలోని మసీదుకు ప్రార్థనల కోసం వెళుతుండగా, ట్రక్కులో అమర్చిన బాంబులు పేలాయని చెప్పారు. ఈ పేలుడు ధాటికి ఎనిమిది గృహాలు కూడా ధ్వంసమయ్యాయని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu