Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద కొరియా మాజీ అధ్యక్షుడు డీజే కన్నుమూత

Advertiesment
కిమ్ డే జుంగ్
దక్షిణ కొరియా ప్రజాస్వామ్య పోరాట యోధుడు, మాజీ అధ్యక్షుడు కిమ్ డే- జుంగ్ మంగళవారం మృతి చెందారు. ఆయన వయసు 85 ఇప్పుడు సంవత్సరాలు. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఉత్తర కొరియాతో తిరిగి సహృద్భావ సంబంధాలు నెలకొల్పేందుకు చేసిన కృషికిగానూ కిమ్‌కు 2000 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

సియోల్ ఆస్పత్రిలో నిమోనియా వ్యాధికి చికిత్స పొందుతూ కిమ్ తుదిశ్వాస విడిచారు. గుండె ఆగిపోవడంతో కిమ్ మృతి చెందారని స్థానిక మీడియా వెల్లడించింది. కిమ్ తన చివరి ఏడాదితో ఆయన చేసిన కృషి అంతా బూడిదపాలు కావడం చూడాల్సి వచ్చింది. దక్షిణ కొరియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సాంప్రదాయవాద వర్గానికి చెందిన అధ్యక్షుడు లీ మైఉంగ్-బాక్ దక్షిణ కొరియాతో ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా స్తంభింపజేశారు.

దీంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు కిమ్ చేసిన కృషి అంతా వ్యర్థమైంది. కిమ్ డే-జుంగ్‌ను ఎక్కువ మంది డీజే అనే పేరుతో పిలుస్తారు. డిసెంబరు 1997లో ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆ సమయంలోనే దక్షిణ కొరియాలో తొలిసారి అధికార పార్టీ అధ్యక్షుడి నుంచి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి చేతికి పాలనాపగ్గాలు వచ్చాయి. ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు 2000వ సంవత్సరంలో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఇల్‌తో డీజే చేతులు కలిపారు. ఇరుదేశాలు విడిపోయిన తరువాత జరిగిన మొదటి శిఖరాగ్ర సదస్సు ఇదే కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu