Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తైవాన్‌లో వరద భీభత్సం: 38 మంది మృతి

Advertiesment
తైవాన్
తైవాన్‌లో మొరాకోత్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఏర్పడిన వరదలు అనేక ప్రాంతాలను నీట ముంచాయి. గత 50 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలను తైవాన్ పౌరులు ఎన్నడూ చూడలేదు. వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 38 మంది మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. మరో 62 మంది పౌరుల ఆచూకీ గల్లంతైందని చెప్పారు. 35 మందిని గాయాలతో సహాయక బృందాలు రక్షించాయి.

గత వారంతానికి మొరాకోత్ తుపాను కారణంగా తైవాన్‌లో మూడు మీటర్ల వర్షపాతం కురవడం గమనార్హం. ఈ భారీ వర్షాల కారణంగా వేలాది ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక వంతనెలు కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వేలాది మంది పౌరులను రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని అధికారిక యంత్రాంగం మంగళవారం వెల్లడించింది. వంతనెలు కూలిపోవడం, నదులు పొంగిపొర్లుతుండటంతో మారుమూల ప్రాంతాల్లో హెలికాఫ్టర్ల ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu