ఉత్తర కొరియా తాజా అణు చర్చలను కోరుకుంటోందని, అయితే ఈ చర్చలను నేరుగా తమతోనే జరిపేందుకు ఆ దేశం సముఖంగా ఉందని అమెరికా గవర్నర్ బిల్ రిచర్డ్సన్ తెలిపారు. ఉత్తర కొరియా పంపిన ప్రతినిధులతో సమావేశమైన అనంతరం రిచర్డ్సన్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా తాజా అణు చర్చల ఆకాంక్షను వెల్లడించారు.
తాజా చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి. ఉత్తర కొరియా ఇప్పుడు అమెరికాతో ప్రత్యక్ష చర్చలను మాత్రమే కోరుకుంటోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ దేశంలో పర్యటించిన తరువాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని రిచర్జ్సన్ పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న అణు వివాదంపై అమెరికాతో ఉత్తర కొరియా నేరుగా చర్చలు జరపాలని కోరుకుంటుందన్నారు. ఇదిలా ఉంటే గతంలో ఈ అణు వివాదంపై జరిగిన ఆరు దేశాల చర్చలను పునరుద్ధరించాలని అమెరికా కోరుకుంటోంది. ఉత్తర కొరియా మాత్రం తాము మళ్లీ ఆరు దేశాల చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.