Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జెరూసలేం సార్వభౌమత్వంపై రాజీపడబోము

Advertiesment
ఇజ్రాయేల్
సమస్యాత్మక మధ్యప్రాచ్య ప్రాంత శాంతి ప్రక్రియపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల నేతలతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు సోమవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెరూసలేం సార్వభౌమత్వం విషయంలో తమ దేశం రాజీపడబోదని స్పష్టం చేశారు.

జెరూసలేం సార్వభౌమత్వానికి ఎటువంటి షరతులు ఉండకూడదని ఇజ్రాయేల్ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. లండన్, బెర్లిన్ నగరాల పర్యటనలో నెతాన్యాహు ఇదే విషయాన్ని ఆయా దేశాల అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లనున్నారని ఇజ్రాయేల్ అధికారిక వర్గాలు తెలిపాయి. జెరూసలేం వాసులు సాధారణ జీవనం గడిపేందుకు కచ్చితమైన హామీలు కావాలని ఇజ్రాయేల్ కోరుకుంటుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu